టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అదిరే బిజినెస్.. ఏడాదికి కోట్లలలొ లాభం!

టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో నెగటివ్ షేడ్స్‌తో ను ప్రారంభించిన సందీప్ కిషన్, తన కష్టంతో నెమ్మదిగా హీరోగా స్థిరపడ్డాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్ సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన హిట్ పడక చాలా కాలం అయింది. అయినా కూడా నిరాశ పడకుండా నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.

అదిరిపోయిన వ్యాపార ఆలోచన

సందీప్ కెరీర్ ప్రారంభ దశలోనే తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని స్నేహితులతో కలిసి హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టాడు. హైదరాబాద్‌లో అప్పటివరకు బేస్డ్ రెస్టారెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే నగరవాసులకు చక్కటి తెలుగు ఆహారాన్ని అందించేందుకు “వివాహ భోజనంబు” పేరిట జూబ్లీహిల్స్ ఒక రెస్టారెంట్ ప్రారంభించాడు.

ఈ రెస్టారెంట్ ప్రారంభమైన కొద్ది రోజులలోనే మంచి పేరు సంపాదించడంతో పాటు, బ్రాండ్‌గా ఎదిగింది. ఫుడ్ & బేవరేజ్ రంగంలో నాణ్యతను మెయింటైన్ చేస్తే బ్రాండ్ నిలబడతుందన్న విషయాన్ని సందీప్ బాగా అర్థం చేసుకున్నాడు. అదే కారణంగా “వివాహ భోజనంబు” రెస్టారెంట్‌కి రోజురోజుకూ ఆదరణ పెరుగుతూ వచ్చింది.

విస్తృత వ్యాపార విస్తరణ

ఈ సక్సెస్‌ను భద్రపర్చుకుంటూ, వివాహ భోజనంబు జూబ్లీహిల్స్‌లో మొదలైన తరవాత, సికింద్రాబాద్, సైనిక్‌పురి, తిరుపతి, అనంతపురం, చెన్నై లాంటి నగరాల్లో బ్రాంచులను ప్రారంభించాడు. అంతేకాదు, క్యాటరింగ్ సర్వీసుల్లోకి కూడా అడుగుపెట్టి, వివాహ భోజనంబును ఓ పూర్తిస్థాయి ఫుడ్ బ్రాండ్‌గా మార్చాడు.

ఇంకా సెలూన్ బిజినెస్‌లోకి అడుగు!

ఫుడ్ ఇండస్ట్రీతో పరిమితం కాకుండా, సందీప్ తాజాగా సెలూన్ వ్యాపారంలోనూ ప్రవేశించాడు. విజయవాడలో “ఎక్స్‌ప్రెస్” పేరుతో ఒక హై-ఎండ్ సెలూన్‌ను ప్రారంభించాడు. ఇది సక్సెస్ అయితే, సందీప్ వ్యాపార రంగంలో మరో మెట్టు ఎక్కినట్టే అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా కంటే ఎక్కువ ఆదాయం బిజినెస్ నుంచే!

ప్రస్తుతం సందీప్ కిషన్ నటన కంటే కూడా వ్యాపార రంగం నుంచే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. రెస్టారెంట్‌లలో రివెన్యూ మరియు బ్రాంచుల విస్తరణ చూస్తే, ఆయన వ్యాపార విజన్ ఎంత తెలివిగా ఉందో స్పష్టమవుతుంది. తగిన ప్లానింగ్, సరైన పెట్టుబడి, కచ్చితమైన ఎగ్జిక్యూషన్ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని సందీప్ జీవితం చెబుతుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *