
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన, తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని అన్నారు.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025
‘‘జనసేన (Janasena) పార్టీకి జన్మనిచ్చిన నేల.. నాకు పునర్జన్మను ఇచ్చిన నేల.. నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్యలు కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలతో పాటు దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు.