Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ(Tirumala Tirupathi Devasthanam) తెలిపింది. ఇప్పటికే భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయని, భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్(Krishnateja Guest House) బయటి వరకు క్యూలైన్లలో నిలిచి ఉన్నారని పేర్కొంది.

Image

వేసవి సెలవులు ముగియడంతో పాటు స్కూళ్ల తెరుచుకుంటుండగా పిల్లలతోపాటు తల్లిదండ్రులు భారీగా స్వామి వారి దర్శనానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బుధవారం భక్తుల రద్దీ సాధారణం కంటే అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న 80,440మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,687 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.47కోట్లు సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది. కాగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలు ఉంటాయని టీటీడీ తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *