IND vs ENG 1st Test: పంత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్(Rishabh Pant) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 134 రన్స్ చేసిన ఈ లెఫ్టాండర్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 131 బంతుల్లో 3 సిక్సులు, 15 ఫోర్లతో సెంచరీ(118) పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.

Image

ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో బషీర్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్(113*) సైతం భారీ శతకంతోపాటు కరుణ్ నాయర్(0*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు రెండో ఇన్నింగ్స్‌లో 287/4తో ఉండగా.. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని మొత్తం 293 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 4 రన్స్ చేయగా, సాయి సుదర్శన్ 30, గిల్ 8 రన్స్ చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ రెండు, స్టోక్స్ ఒక వికెట్ తీశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *