Rashmika: ‘నువ్వు నా జీవితంలో ఎంతో విలువైన స్నేహితుడివి’.. రష్మిక పోస్ట్​ వైరల్​

‘కుబేర’తో రష్మిక మందాన బ్లాక్​ బస్టర్​ విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్​ను ఆస్వాధిస్తున్న రష్మిక ప్రస్తుతం నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ రవీంద్రన్ బర్త్ డే (జూన్ 23) సందర్భంగా రష్మిక ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. రాహుల్​ రవీంద్రన్​పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేసింది. సినిమాపై రాహుల్​కు ఉన్న అభిరుచిని కూడా పంచుకుంది.

హ్యాపీ బర్త్ డే రాహుల్ సర్..

‘రాహులా.. ఈ రోజు (జూన్ 23) నీ బర్త్ డే. అయినా నువ్వు ఇంకా రిహార్సల్స్ చేస్తూనే ఉన్నావు. నేను నీ కోసం పోస్ట్ వేస్తున్నా.. నా ముందు మాత్రం నువ్వు ఇంకా రిహార్సల్స్ చేస్తూనే ఉన్నావు. నువ్వు నా జీవితంలో ఎంతో విలువైన స్నేహితుడివి.. గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాను తీశావంటే ఇంకా నమ్మలేకపోతోన్నా.. నీ హృదయంలో ఇన్ని లోతైన భావాలున్నాయా..? సినిమాపై ప్రతీ ఫ్రేమ్ మీ మనసుని ప్రతిబింబించేలా ఉంది.. ది గర్ల్ ఫ్రెండ్ కోసం నిన్ను కలిస్తే నాకు ఓ మంచి దర్శకుడు, స్నేహితుడు, మెంటర్, పార్ట్నర్ ఇన్ క్రైమ్ దొరికాడు. నీ మీద నాకు ఎంతో అపారమైన నమ్మకం, గౌరవం ఏర్పడింది. హ్యాపీ బర్త్ డే రాహుల్ సర్. గర్ల్ ఫ్రెండ్‌ని ఈ ప్రపంచం ఎప్పుడెప్పుడు చూస్తుందా? అని వెయిట్ చేస్తున్నా.. ఇది నాకెంతో ప్రత్యేకం’ అని రష్మిక పోస్ట్ వేశారు.

మరో కొత్త యాంగిల్‌లో..

గర్ల్​ఫ్రెండ్​లో రష్మికను మరో కొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేయబోతోన్నారు దర్శకుడు రాహుల్​ రవీంద్రన్​. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్లు అయితే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. రష్మికకు మరో కొత్త పాత్ర దక్కిందని, నటిగా మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుందని మూవీ లవర్స్​ చర్చించుకుంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *