‘WAR-2’ మూవీ షూటింగ్ కంప్లీట్.. తారక్‌పై హృతిక్ ప్రశంసల జల్లు

యావత్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War2)’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) సోషల్ మీడియా(SM) వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సహనటుడు జూనియర్ ఎన్టీఆర్‌(Jr. NTR)పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు 149 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు ముగిసిందని హృతిక్ తన పోస్టు(Post)లో తెలిపారు. “ఛేజింగ్‌లు, యాక్షన్, డ్యాన్స్, రక్తం, చెమట, గాయాలతో గడిచిన ఈ 149 రోజుల ప్రయాణం పూర్తయింది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది” అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పనిచేయడం మిశ్రమ భావోద్వేగాలను మిగిల్చిందని అన్నారు.

<i>War 2</i>: Latest Posters Of Hrithik Roshan, Kiara Advani And Jr NTR Take The Internet By Storm

ఎన్టీఆర్ గారితోకలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా..

కో-యాక్టర్స్ గురించి మాట్లాడుతూ, “ఎన్టీఆర్ గారూ.. మీతో కలిసి పనిచేయడం, ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని సృష్టించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని హృతిక్ వ్యాఖ్యానించారు. కథానాయిక కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రస్తావిస్తూ, “తెరపై నీలోని మరో ప్రమాదకరమైన కోణాన్ని ప్రపంచం చూడబోతోంది. నీతో స్క్రీన్ పంచుకోవడం అద్భుతంగా అనిపించింది” అంటూ ప్రశంసించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Director Ayan Mukherjee), నిర్మాత ఆదిత్య చోప్రా(Aditya Chopra)ల సినిమాటిక్ విజన్‌కు హృతిక్ ధన్యవాదాలు తెలిపారు. చిత్రబృందం మొత్తం తమ శక్తికి మించి పనిచేశారని కొనియాడారు. కాగా ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *