India Womens: అదరగొట్టిన హర్మన్ సేన.. ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై తొలి టీ20 సిరీస్ కైవసం

టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్ (India Womens Team) అదరగొట్టింది. ఇంగ్లండ్‌(England)తో జరిగిన 4వ టీ20లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నెగ్గింది. ఈ విజయంతో ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్‌‌ను సాధించి చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్(Manchester) వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సోఫియా డంక్లీ (22) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో రాధా యాదవ్‌(Radha Yadhav) 2, శ్రీ చరణి 2, అమన్‌జోత్‌ కౌర్‌, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ తీశారు.

Image

17 ఓవర్లలోనే పూర్తి చేశారు..

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ సేన 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీంలో స్మృతి మంధాన (32), షెఫాలీ వర్మ (31), రోడ్రిగ్స్‌ (24*), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26) రాణించారు. కాగా ట్రెంట్ బ్రిడ్జ్‌(Trentbridge)లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇక బ్రిస్టల్‌(Bristol)లో జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగులతో నెగ్గింది. ఓవల్‌(Ovel)లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. అద్భుత బౌలింగ్‌తో రాణించిన రాధా యాదవ్ (4 ఓవర్లలో 15/2)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

12న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా చివరి టీ20

తాజాగా నిన్న రాత్రి జరిగిన మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను పట్టేసింది. కాగా ఈనెల 12న ఐదో మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌(Edgebaston) వేదికగా జరగనుంది. ఇరుదేశాల మధ్య ఇంతవరకు 6 ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అన్ని సిరీస్‌లను ఇంగ్లండే గెలిచింది. 2006లో డర్బీ(Durby)లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక T20లో భారత్‌ గెలుపొందింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *