Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu)’ మూవీ టీమ్‌కు తీపికబురు అందించింది. పవన్ సినిమా టికెట్ ధరల పెంపు(Ticket price increase)నకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ మూవీ జులై 24న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్రొడ్యూసర్స్ మొదట 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి కోరగా, ప్రభుత్వం 10 రోజులు (జులై 24 నుంచి ఆగస్టు 2, 2025) మాత్రమే అనుమతించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ధరల పెంపుపై నిర్మాత ఏఎం రత్నం హర్షం

దీంతో సింగిల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ టికెట్ ధర రూ.297, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.377గా ఉండనుంది. అదనంగా, జులై 23న రాత్రి 9 గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్ షో(Premiere shows)లకూ అనుమతి ఇవ్వగా, ఈ టికెట్ ధర రూ.600 (GSTతో)గా నిర్ణయించారు.ఈ నిర్ణయం చిత్ర యూనిట్‌లో సంతోషం నింపింది. నిర్మాత ఏఎం రత్నం ఈ పెంపును భారీ బడ్జెట్, VFX, ప్రముఖ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి ఇది అవసరమని పేర్కొన్నారు.

కాగా జ్యోతికృష్ణ(Jyithi Krishna) దర్శకత్వంలో, నిధి అగర్వాల్(Nidhi Agharwal), బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందింది. అభిమానులు ఈ ధరల పెంపును స్వాగతిస్తూ, సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ(Telangana)లో కూడా టికెట్ ధరలను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నిర్మాత అర్జీ పెట్టుకున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి.

Second single from 'Hari Hara Veera Mallu' turns out to be an instant chartbuster; film to release on March 28 - Telangana Today

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *