Gold Price: బంగారం భగభగలు.. మళ్లీ పెరిగిన వెండి ధరలు

భారత్‌(India)లో బంగారా(Gold)నికి ఎనలేని డిమాండ్(Demand) ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీని ఎక్కువగా పండగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా పని చేస్తుంది. అందుకే.. ఎప్పుడూ ఇక్కడ డిమాండ్ తగ్గదు. అయితే గత కొంత కాలంగా అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు(Middle-East War Crisis), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు(Tariffs) విధించిన కారణంగా అనిశ్చితి ఏర్పడి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది.

సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతున్న క్రమంలో..

అయితే ఇప్పుడు మళ్లీ (ఆగస్ట్ 1) సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. చాలా దేశాలపై ట్రంప్ ఇంకా చర్చలు సాగిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. ఆ దేశంపై 20 శాతం వరకు దిగుమతి సుంకాల్ని విధిస్తారని తెలుస్తోంది. ఇంకా భారత్‌తో కూడా అమెరికా వాణిజ్య ఒప్పందం కొలిక్కిరాలేదు. ఈ క్రమంలోనే డాలర్ విలువ కోల్పోతుండగా గోల్డ్ పుంజుకుంటోంది. దీంతో భారత్‌లో గత మూడు రోజులుగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Trump's victory will bring record fall in gold- Donald Trump

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

కాగా బుధవారం (July 23) హైదరాబాద్‌(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.93,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,040 పెరిగి రూ.1,02,330కి చేరింది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ. 1,000 పెరిగి రూ.1,29,000గా కొనసాగుతోంది. ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *