Mirai: తేజా సజ్జ ‘మిరాయ్’ నుంచి ‘ఓ పోరి దిల్దారు.. వయ్యారివే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హనుమాన్ (Hanu-Man movie) సినిమాతో భారీ విజయం సాధించిన తేజా సజ్జ (Hero teja sajja) వరుస సినిమాలతో బిజీగా మారాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న కొత్త మూవీ ‘మిరాయ్(MIrai)’. ఈ సినిమా టీజర్​ను ఇదివరకే చిత్రబృందం రిలీజ్​ చేసిన విషయం తెలిసిందే. ‘జరగబోయేది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏశక్తీ దీన్ని ఆపలేదు..’ అంటూ ఆసక్తికర డైలాగులతో టీజర్‌ ఆకట్టుకుంది. మిరాయ్​లో రితికా నాయక్ (Ritika Nayak)​ హీరోయిన్​గా నటిస్తుండగా.. మంచు మనోజ్‌ (Manchu Manoj), శ్రియా శరణ్​, జగపతి బాబు, జర్మనీ నటి తంజా కెల్లర్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది.

హనుమాన్‌ను మించిన బడ్జెట్..

కాగా హనుమాన్ సినిమా కంటే మిరాయ్ బడ్జెట్(Budget) పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా. ఇకపోతే ‘హనుమాన్’ సినిమా రూ. 40 కోట్ల బడ్జెట్‌తోనే రూపొందినా వంద కోట్లకు పైగానే కలెక్షన్లు(Collections) రాబట్టింది. అయితే, ‘మిరాయ్’ని పాన్-ఇండియా అడ్వెంచర్‌గా ప్లాన్ చేయడంతో బడ్జెట్ పెరిగినట్లు సమాచారం. ‘మిరాయ్’సినిమా షూటింగ్(Shooting) ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకోగా.. నేపాల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం, ముంబైలోని చారిత్రక గుహల్లో(mumbai historical caves) పెద్ద షెడ్యూల్ జరుపుకుంది.

Super Hero Teja Sajja, Karthik Ghattamaneni, TG Vishwa Prasad, Krithi  Prasad, People Media Factory's Pan India Film Mirai First Single Vibe  irukku baby On July 26th ! - Moviewingz.com

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *