Telugu film industry: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో కార్మికుల వేతనాల పెంపుపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా కార్మికుల వేతనాల(Film workers’ salaries)ను 30 శాతం పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు నిర్మాతల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇవాళ్టి (ఆగస్టు 4) నుంచి సినిమా, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్, టీవీ ప్రోగ్రామ్‌ల షూటింగ్‌(Shootings)లను నిలిపివేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం రేకెత్తించింది.

ప్రతి మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు

ఫెడరేషన్ ప్రకారం, ప్రతి మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు నిబంధన జూన్ 30తో ముగిసింది. అయినప్పటికీ, నిర్మాతలు(Producers) ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. వేతన పెంపును రాతపూర్వకంగా అంగీకరించిన నిర్మాతల షూటింగ్‌లకు మాత్రమే కార్మికులు హాజరవుతారని, లేనిపక్షంలో షూటింగ్‌లలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం టాలీవుడ్‌(Tollywood)లోని అనేక ప్రాజెక్టులపై ప్రభావం చూపనుంది.అయితే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ డిమాండ్‌కు సమాధానంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

యూనియన్ మెంబర్‌షిప్ అవసరం లేకుండా

నైపుణ్యం కలిగిన కార్మికులకు యూనియన్ మెంబర్‌షిప్ అవసరం లేకుండా నిర్మాతలు వారిని నేరుగా నియమించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం నిర్మాతల శ్రేయస్సు, చిత్ర పరిశ్రమ మనుగడ కోసమని ఛాంబర్ పేర్కొంది. ఈ రెండు నిర్ణయాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆందోళనలో ఉన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *