మొదటి రోజే 9000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది..

డైనోసార్ల(Dinosaurs ) ఆధారంగా రూపొందిన జురాసిక్ పార్క్(Jurassic park) సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానం ఉంది. భారతదేశంలోనూ ఈ సిరీస్‌కు ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు. జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటివరకు పలు సూపర్‌హిట్ సినిమాలు విడుదల కాగా, అవన్నీ భారీ కలెక్షన్లను సాధించాయి.

ఈ సిరీస్‌లోనే ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’(Jurassic World: Rebirth), 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్ కు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూలై 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, గత సినిమాలకి కొంత భిన్నంగా ఉన్నా, ఆడియెన్స్‌ను ఆకట్టుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది. భారతదేశంలోనూ ఈ సినిమాకు భారీ స్పందన లభించింది.

విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం, ఏలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) , ఆపిల్ ప్లస్(apple Plus) ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో ఆన్ డిమాండ్ (వీవీఓడీ) విధానంలో (అద్దెకు) అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది ఉచిత స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది.

ఈ హాలీవుడ్ చిత్రానికి గరెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించగా, స్క్రీన్‌ప్లేను డేవిడ్ కోప్ అందించారు. ప్రముఖ నటి స్కార్లెట్ జోహాన్సన్ ప్రధాన పాత్ర పోషించగా, ఆడ్రినా మిరాండా, ఎడ్ స్క్రెయిన్, జొనాథన్ బెయిలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో విడుదల అయ్యింది. ఇండియా, చైనా, కొరియా, యూకే, నార్త్ అమెరికా, మలేషియా, బ్రెజిల్ లాంటి కీలక దేశాల్లో భారీ రిలీజ్‌ సాధించింది. విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి, వరల్డ్ వైడ్‌గా $105 మిలియన్ డాలర్లు (సుమారుగా ₹9,000 కోట్లు) వసూలు చేసినట్లు డెడ్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *