Rahul Sipligunj: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 3 విజేతగా, ఆస్కార్ అవార్డ్(Oscar Award) గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆగస్టు 17న హైదరాబాద్‌(Hyderabad)లో రాహుల్ తన ప్రేయసి హరిణి రెడ్డి(Harini Reddy)తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుక సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. రాహుల్ సాధారణంగా తన జీవిత విశేషాలను అభిమానులతో సోషల్ మీడియా(Social Media) ద్వారా పంచుకుంటారు.

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

అయితే, ఈ ఎంగేజ్‌మెంట్‌(Engagement)ను రహస్యంగా ఉంచడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అధికారిక ఫొటోలు విడుదల కానప్పటికీ, కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ(Lavender Sherwani)లో రాజసం ఉట్టిపడగా, హరిణి రెడ్డి ఆరెంజ్ లెహంగాలో ఆకర్షణీయంగా కనిపించారు. ఈ జంట కలర్‌ఫుల్ ట్రెడిషనల్ దుస్తుల్లో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హరిణి రెడ్డి గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రైవేట్‌గా ఉంది.

రూ. కోటి బహుమతి తెలంగాణ సర్కార్

సుమారు 15,600 మంది ఫాలోవర్లతో ఆమెకు సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖుల ఫాలో అవుతున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌కు ఆస్కార్ గెలిచినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.కోటి బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు(Wishes) తెలుపుతున్నారు. వీరి వివాహ(Marriage Day) తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *