Vishwambhara: ‘విశ్వంభర’ ఆలస్యం ఎందుకో చెప్పేసిన మెగాస్టార్.. రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’ విడుదలపై కొంతకాలంగా నెలకొన్న సందేహాలకు ఆయన స్వయంగా తెరదించారు. ఈ సినిమాను 2026 వేసవిలో కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిరు స్పష్టం చేశారు. తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు (ఆగస్టు 21) సాయంత్రం 6.60 గంటలకు ఒక ప్రత్యేక వీడియో విడుదల(Special Video) చేయనున్నట్లు మెగాస్టార్ చిత్ర బృందం విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. సినిమా ఆలస్యం కావడంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికే ఈ వీడియో చేస్తున్నానని చిరంజీవి తెలిపారు.

సెకండాఫ్ మొత్తం VFX, గ్రాఫిక్స్‌పైనే..

“ఈ సినిమా సెకండాఫ్ మొత్తం VFX, గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నత నాణ్యతతో కూడిన అవుట్‌పుట్ అందించాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ భారీ గ్రాఫిక్స్ పనుల వల్లే సినిమా ఆలస్యమవుతోంది” అని ఆయన వివరించారు. ‘విశ్వంభర’ ఒక అద్భుతమైన చందమామ కథ లాంటిదని, ఇది పిల్లలతో పాటు ప్రతి పెద్దవారిలో ఉండే చిన్నపిల్లవాడిని కూడా ఎంతగానో అలరిస్తుందని చిరు భరోసా ఇచ్చారు.

పిల్లలకు వేసవి సెలవులు అంటే చాలా ఇష్టమని

పిల్లలకు వేసవి సెలవులు అంటే చాలా ఇష్టమని, అందుకే వారిని దృష్టిలో ఉంచుకుని 2026 వేసవిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ‘బింబిసార’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వశిష్ఠ(Vasistha) ఈ సినిమాను తన కలల ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్(Trisha Krishnan) కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్(Aashika Ranganath), కునాల్ కపూర్(Kunal Kapoor) కీలక పాత్రలు పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *