Rishabh Shetty: ‘కాంతార చాప్టర్-1’ థియేట్రికల్ రైట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన స్వయం దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్స్‌లోకి రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Rukmini Vasanth shines as Kanakavathi in 'Kantara Chapter 1' first look

ఓకేసారి ఏడు భాషల్లో విడుదల

కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ‘కాంతార చాప్టర్-1’ తెలుగు రైట్స్‌(Telugu Rights)ను దాదాపు రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. నైజాం ప్రాంతానికి రూ.40 కోట్లు, ఆంధ్రకు రూ. 45 కోట్లు, సీడెడ్‌కు రూ.15 కోట్లుగా ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భారీ డీల్ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. మొదటి భాగం కంటెంట్‌తో అన్ని భాషల్లో ఆకట్టుకోవడంతో, ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో..

ఈ సినిమా కోసం రూ.120 కోట్ల బడ్జెట్‌తో రిషబ్ శెట్టి భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సైతం మంచి సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. అయితే, ఈ మూవీకి రూ.100 కోట్ల రైట్స్ ధరపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కంటెంట్ ఆధారిత చిత్రానికి ఇంత భారీ డీల్ అవసరమా అనే చర్చ కూడా సాగుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *