Vietnam Boat Capsize: వియత్నాంలో పడవ బోల్తా.. 34 మంది మృతి

వియత్నాం(Vietnam)లో ఘోర ప్రమాదం జరిగింది. హలోంగ్ బే వద్ద శనివారం సాయంత్రం (జులై 19) జరిగిన పడవ బోల్తా(boat capsized) పడి 34 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు(Tourists) ఉండగా, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదానికి భారీ ఈదురు గాలులు(Strong gusty winds), ఉరుములతో కూడిన వాతావరణం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పడవ అదుపు తప్పడంతో నీటిలో మునిగిపోయింది. ఫలితంగా 34 మంది ప్రాణాలు కోల్పోగా, 8 మంది గల్లంతయ్యారు.

23 మందిని రక్షించింన సిబ్బంది

కాగా, సమాచారం అందుకున్న సహాయక బృందాలు(Rescue Teams) వెంటనే రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలు చేపట్టాయి, 23 మందిని సురక్షితంగా కాపాడాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన వియత్నాంలోని సముద్ర ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాల లోపాలను మరోసారి బయటపెట్టింది. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఈ విషాదాన్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన పర్యాటక రంగంలో భద్రతా చర్యల ఆవశ్యకతను గుర్తుచేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *