‘ఆ రోజు విరాట్‌ కంటతడి పెట్టాడని అనుష్క చెప్పింది’

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేటింగ్ రోజుల నుంచి పెళ్లయి ఇద్దరు పిల్లల్ని కన్నప్పటి వరకు ఈ జంట మొదటి నుంచి పవర్ కపుల్ గా పేరుపొందారు. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ ను బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ షేర్ చేసుకున్నాడు. తన లేటెస్ట్ సినిమా ‘బేబీ జాన్‌’ (Baby John) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం పంచుకున్నాడు.

బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) తన కోస్టార్స్‌ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా ‘సుయి ధాగా’ హీరోయిన్‌ అనుష్క శర్మ (Anushka Sharma) గురించి ఆమె భర్త విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. 2018లో విడుదలైన ‘సుయి ధాగా’ కోసం అనుష్కతో కలిసి వరుణ్ నటించిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో తాము ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నామని.. తాను ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా ఉంటుందని.. అనుకున్న విషయాన్ని నిస్సంకోచంగా బయటపెడుతుందని చెప్పుకొచ్చాడు.

“అనుష్క (Virat Anuksha News) అన్యాయాన్ని అస్సలు సహించదు. సాధారణంగా ఆమెను చూసి బయటివారు ఒక ఒపీనియన్ కు వస్తారు. కానీ ఎవరికీ ఆమె గురించి తెలియదు. తను కూడా తన గురించి ఎవరు ఏమనుకుంటారు అన్న విషయం పట్టించుకోదు. తనకేం అనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. సుయీధాగా సమయంలో విరాట్‌ కోహ్లీ గురించి ఆమె కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.

విరాట్ చాలా సెన్సిటివ్‌ అని చెప్పింది. నాటింగ్ హామ్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడంతో ఆయన రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పింది. ఆ రోజు మ్యాచ్‌లో ఆయన మంచి స్కోర్‌ చేసినా టీమ్ ఓటమి విషయంలో తనని తానే నిందించుకున్నారని అనుష్క తెలిపింది’’ అని ఈ పాడ్ కాస్ట్ లో హీరో వరుణ్‌ ధావన్‌ చెప్పుకొచ్చాడు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *