Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. అగ్నిప్ర‌మాదంలో జ‌రిగిన న‌ష్టాన్ని త‌క్ష‌ణ‌మే అంచ‌నా వేసి నివేదిక అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వంద కొట్ల‌తో అభివృద్ధి చేస్తా:
మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌నలు పున‌రావృతం కాకుండా రూ.100కోట్ల నిధుల‌తో మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన మార్కెట్ యార్డ్‌గా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. మార్కెట్ ప‌రిస‌రా ప్రాంతాల్లో ర‌హ‌దారులు విస్త‌రించేందుకు ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

ప‌దిరోజుల్లో కొత్త మార్కెట్:
ప‌దిరోజుల్లోనే మ‌ద్దుల‌ప‌ల్లి మార్కెట్ ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే జ‌రుగుతున్న మార్కెట్ నిర్మాణ ప‌నుల‌ను స్వ‌యంగా జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్యావేక్ష‌ణ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అప్ప‌టివ‌ర‌కు రైతులు సంయ‌మ‌నం పాటించాల‌ని తుమ్మ‌ల కోరారు. గతంలో మాదిరిగానే మార్కెట్ యార్డులో అగ్నిమాప‌క యంత్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *