Plane Crash: విమాన ప్రమాదం.. 274కి చేరిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా కూలిన ఘటన(Air India crash incident)లో మృతుల సంఖ్య 274కి చేరింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో ఉన్న 241 మంది ప్రయాణికులు(Passengers), సిబ్బంది మరణించగా.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని మెడికోలు(Medicos) 24 మంది మరణించారు. తాజాగా గాయపడిన మెడికోలలో మరో 9 మంది కన్నుమూయడంతో ఆ సంఖ్య 274కి చేరింది. కాగా ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్‌(Wing flap)లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఇండియాలో జరిగిన గగనతల ప్రమాదాల్లో పలువురు మరణించారు. వారు ఎవరో ఓసారి చూద్దామా..

విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించింది వీరే..

సౌందర్య (2004): ప్రముఖ నటి, నిర్మాత అయిన సౌందర్య(Soundarya) ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్ వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె అమ్మోరు, సూర్యవంశం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన నటించారు.

Soundarya, Sanjay Gandhi, YSR Reddy Famous Celebrities Who Died In  helicopter crash | Celebrity Helicopter Crash | சஞ்சய் காந்தி, செளந்தர்யா,  ஒய்எஸ்ஆர் ரெட்டி: எமனான ஹெலிகாப்டர் பயணங்கள்

హోమీ జహంగీర్ బాబా (1966): భారత అణు శాస్త్రవేత్త, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 స్విస్ ఆల్ప్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కూలిపోవడంతో మరణించారు.

సంజయ్ గాంధీ (1980): మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం వద్ద గ్లైడర్ ప్రమాదంలో మరణించారు.

YS రాజశేఖర రెడ్డి (2009): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లాకు వెళుతుండగా నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.

బిపిన్ రావత్ (2021): భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) బిపిన్ రావత్(Bipin Rawat) తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో భార్య మధులికతో సహా మరణించారు.

10 air crashes that killed high-profile Indians - India Today

మాధవరావ్ సింధియా (2001): కాంగ్రెస్ నాయకుడు, కాన్పూర్‌కు వెళుతుండగా సెస్నా విమానం కూలిపోవడంతో మరణించారు.

జి.ఎం.సి. బాలయోగి (2002): టీడీపీ నేత, లోక్‌సభ స్పీకర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.

ఓ.పి. జిందాల్ (2005): హరియాణా మంత్రి, పారిశ్రామికవేత్త, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

సురేంద్ర నాథ్ (1994): హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యులతో సహా మరణించారు.

తరుణి సచ్‌దేవ్ (2012): బాల నటి, నేపాల్‌లోని జోమ్సోమ్ విమానాశ్రయం సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో తల్లితో సహా మరణించారు.

ఇందర్ ఠాకూర్ (1985): నటుడు, ఎయిర్ ఇండియా పర్సర్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు పేలుడు కారణంగా మరణించారు.

సుభాష్ చంద్ర బోస్ (1945): ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, తైపీ నుంచి మంచూరియాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. అయితే ఆయన మరణంపై అధికారంగా క్లారిటీ లేదు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *