అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాగ్, ధనుష్ తొలిసారి తెరపై కనిపిస్తుండటంతో ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామా సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాలోని కీలక అంశాలను, పాత్రల తీరుతెన్నులను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రెట్టింపు చేసింది.

డబ్బు చుట్టూ తిరిగే కథలో..
ఇక 2 నిమిషాల 38 సెకన్లున్న ఈ ట్రైలర్లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్(DSP) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. శేఖర్ కమ్ముల మార్క్ భావోద్వేగాలతో పాటు, యాక్షన్ సీన్స్(Action scenes) మూవీకి హైలైట్గా నిలవనున్నాయని ట్రైలర్ స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా, డబ్బు(Money) చుట్టూ తిరిగే కథలో మానవ సంబంధాలు, నైతిక విలువలు ఎలా ప్రభావితమవుతాయనేది ఆసక్తికరంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మనీ చుట్టూ సాగే కుబేర ట్రైలర్ని మీరూ చూసేయండి..






