Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో మరణించారు. ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ వార్త అల్లు కుటుంబాన్ని, సినీ పరిశ్రమను శోక సముద్రంలో ముంచెత్తింది. కనకరత్నమ్మ గారి భౌతికకాయాన్ని ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించారు. ఆమె అంత్యక్రియలు(funeral) శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి.

షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు బన్నీ, చెర్రీ

ఈ మేరకు అల్లు అర్జున్(Allu Arjun), రామ్‌చరణ్‌(Ram Charan)లు తమ షూట్‌లను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్ ముంబైలో అట్లీ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో ఉండగా, రామ్‌చరణ్ మైసూర్‌లో ‘పెద్ది(Peddi)’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. చిరంజీవి(Chiranjeevi) అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబు(Nagababu) విశాఖపట్నంలో జరుగుతున్న సభ కారణంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. కనకరత్నమ్మ గారు అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah)కు జీవిత భాగస్వామిగా, కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

అత్తయ్య మరణం బాధాకరం: చిరంజీవి

అల్లు కనకరత్నమ్మ మరణంపై మెగాస్టార్ చిరంజీవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *