వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో ‘పుష్ప 2’ సెన్సేషనల్ రికార్డు

Mana Enadu : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫ్లవర్.. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తగ్గేదేలే’ అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు పుష్పరాజ్. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ పాత్రలో నటించిన ‘పుష్ప 2 : ది రూల్ ‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పాత రికార్డులన్నీ బద్ధలు కొట్టేస్తోంది. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత రప్ఫాడించేస్తోంది.

పుష్పరాజ్ నయా రికార్డు

కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ పుష్పరాజ్ రప్పారప్పా కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. తాజాగా పుష్ప-2 సినిమా  మరో అరుదైన ఫీట్ సాధించింది.  రూ.632 కోట్లు కలెక్ట్‌ (Pushpa 2 Hindi Collections) చేసి 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం పుష్పరాజ్ సాధించిన మరో ఘనత. ఇక ఈ చిత్రం 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్‌) (Pushpa 2 World Wide Collections) వసూలు చేసింది. విడుదలైన 6 రోజుల్లోనే పుష్ప-2 మూవీ రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో నయా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

జాతర సీక్వెన్సుతో పూనకాలు

ఇక పుష్ప-2 (Pushpa 2 : The Rule) సినిమా సంగతికి వస్తే అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ గా కనిపించింది. ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ లో శ్రీలీల (Sreeleela Pushpa 2) సందడి చేసింది. ఇక ఈ చిత్రంలో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నటనకు మరో నేషనల్ అవార్డు పక్కా అని ఫ్యాన్స్ తో పాటు ఈ మూవీ చూసిన పలువురు ప్రముఖులు కూడా అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *