కాసేపట్లో కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆయన ఆస్పత్రికి వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో (Sandhya Theatre Case) రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు బన్నీ ఈరోజు హాస్పిటల్ కు వెళ్తున్నట్లు తెలిసింది.

మాకు చెప్పే వెళ్లాలి

అయితే కిమ్స్ కు వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని.. తమ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇప్పటికే రాంగోపాల్ పేట్ పోలీసులు (Police Notices To Allu Arjun) అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బన్నీ రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, ఆస్పత్రి వర్గాలు చర్యలు తీసుకున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *