శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న బాలుడు శ్రీతేజ్ (Sri Tej)ను ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్లు తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఉన్నారు. బన్నీ రాకతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గంటలోపు వెళ్లాలి

కిమ్స్​ (KIMS Hospital)కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రాంగోపాల్​పేట పోలీసులు అల్లు అర్జున్ (Allu Arjun Notices) కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసుపత్రికి వచ్చిన గంట లోపు తిరిగి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. సందర్శన అంతా గోప్యంగా ఉంచాలని.. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని ఇందుకు సహకరించాలని చెప్పారు. ఈ నిబంధనలు పాటించకుండా అకస్మాత్తుగా సందర్శనకు వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసుల సూచనల మేరకే అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు.

ఇదీ జరిగిన విషయం

పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) కు అల్లు అర్జున్ తన కుటుంబం, హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బన్నీకి రెగ్యులర్ బెయిల్

అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చిన పోలీసులు ఆయణ్ను అరెస్టు (Allu Arjun Arrest) చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. బన్నీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత అధికారులు ఈ ఘటనలో నోటీసులు ఇచ్చి  విచారణకు పిలిచారు. పోలీసుల సూచన మేరకు బన్నీ విచారణకు హాజరయ్యాడు. ఇక ఇటీవలే నాంపల్లి కోర్టు (Nampally Court) షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *