అమరావతి నగరం కాదు.. ఒక శక్తి: PM Modi

అమరావతి(Amaravathi) ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ(Amaravati Reconstruction) పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. “అమరావతి స్వప్నం సాకారమవుతోంది. చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త AP రూపుదాల్చుతోంది. దుర్గాభవానీ(Dugra Bhavani) కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను” అని వ్యాఖ్యానించారు.

మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం

అనంతరం 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి PM పునఃప్రారంభోత్సవం చేశారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో, సభా వేదిక పైనుంచే రాజధాని పునర్ నిర్మాణ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. బటన్ నొక్కి రాజధాని పనులు సహా మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ రూ.49,040 కోట్లు. రూ.8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా PM నేడు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు.

PM Modi in Amaravati Live: నభూతో నభవిష్యతి.. అత్యాధునిక హంగులతో అమరావతి పునర్నిర్మాణం.. ప్రధాని మోదీ శ్రీకారం - Telugu News | PM Modi in Andhra Pradesh Live Updates, relaunches ...

చంద్రబాబును చూసి నేర్చుకొన్నా.” ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రసంగించారు. PM మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం నాడు 29 వేల మంది రైతులు తమ భవిష్యత్తును త్యాగం చేసి 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. అమరావతి ఉద్యమం లాంటి దాన్ని తన జీవితంలో చూడలేదని కొనియాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *