
ఏపీ(AP)లోని విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన MLA, MLCల సాంస్కృతిక కార్యక్రమా(cultural events)ల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Deputy Speaker Raghuramakrishna Raju) దుర్యోధన ఏకపాత్రాభినయం(Duryodhana monologue) చేసి అందరిని అలరించారు. ‘‘ఆచార్య దేవా… ఏమంటివి, ఏమంటివి’’ అంటూ సుదీర్ఘమైన డైలాగులను తనదైన శైలిలో పలికి రంజింపజేశారు. ఆయన నటనకు కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. దీంతో స్టేజీపై రఘురామ ప్రదర్శనను సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర సభ్యులు ఎంతో ఆస్వాదించారు. ప్రదర్శన అయిపోయాక లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. ‘రఘురామా.. మీ టాలెంట్ సూపర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్న గారు ఎన్టీఆర్ నటించిన “దాన వీర శూర కర్ణ” సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ చెప్పి, అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు గారు. #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/ok6W1oRY6k
— Telugu Desam Party (@JaiTDP) March 20, 2025
బాలచంద్రుడి వేష ధారణలో మంత్రి కందుల
అనంతరం పల్నాటి బాలచంద్రుడి(Palnadu Balachandra) వేష ధారణలో మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అదరగొట్టారు. వేషధారణ, అద్భుతమైన డైలాగ్లతో అందరినీ ఆకర్షించారు. దుర్గేష్ ప్రదర్శనకు సభ్యుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో విజయవాడ(Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లో ఏపీ శాసన సభ్యులు, మండలి సభ్యులకు సాంస్కృతిక, ఆటపోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సభ్యులందరూ పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. గురువారంతో ఈ కార్యక్రమాలు ముగిశాయి.
“ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవెనింగ్” కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు ‘బాలచంద్ర’ పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరిని అలరించారు.
సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో… pic.twitter.com/iOkCb041mq
— Kandula Durgesh (@kanduladurgesh) March 20, 2025