BGT 2nd Test Day2: కష్టమే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల తడబాటు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టెస్టులో భారత్(Aus vs Ind) తడబడుతోంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 29 రన్స్ వెనుకబడి ఉంది. టీమ్ఇండియాలో జైస్వాల్ 24, రాహుల్ 7, గిల్ 28, కోహ్లీ 11, రోహిత్ 6 మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో పంత్ (28 నాటౌట్), నితీశ్ (15 నాటౌట్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్క్(Starc) ఒక వికెట్ తీశాడు. కాగా రేపు ఉదయం 9.30 గంటలకు మూడో రోజు ఆట ప్రారంభమవుతుంది.

జట్టుకు భారంగా మారొద్దు..

ఓ పక్క ఆసీస్ బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టిన పిచ్‌పై టీమ్ఇండియా(Team India) బ్యాటర్లు తడబడ్డారు. క్రీజులో నిలబడేందుకే ఆపసోపాలు పడ్డారు. దీంతో వచ్చీ రాగానే పెవిలియన్ బాట పట్టారు. జట్టును ఆదుకోవాల్సిన సీనియర్ బ్యాటర్లు కోహ్లీ(Kohli), రోహిత్(Rohit) తీవ్రంగా నిరాశపర్చుతున్నారు. రోహిత్ గత 12 ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇలా అయితే హిట్ మ్యాన్(Hit man) టెస్టుల్లో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశాలు లేవని క్రికెట్ మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆసీస్‌కు 157 రన్స్ లీడ్

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head) వన్డే తరహా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 141 బంతుల్లో 140 రన్స్ చేసి రాణించాడు. లబుషేన్ 64, స్వీనీ 39 రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు కూల్చారు. అశ్విన్, నితీశ్ చెరో వికెట్ తీశారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 రన్స్‌కే కుప్పకూలిన విషయం తెలిసిందే.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *