Manchu Manoj: ‘ఆయ‌న కొడుకు వ‌చ్చాడ‌ని చెప్పు’.. మనోజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

మంచు మనోజ్(Manchu Manoj)న‌టించిన ‘భైర‌వం(Bhairavam)’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో మంచు మ‌నోజ్ ‘X’ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్(Post) పెట్టాడు. ‘పెద‌రాయుడు(Pedarayudu Movie)’ మూవీలోని మోహ‌న్ బాబు(Mohan Babu) ఫొటో ప‌క్క‌న‌ త‌న ఫొటో(Photo)ను ఎడిట్ చేసి పంచుకున్నాడు. పైగా దానికి “ఆయ‌న కొడుకు వ‌చ్చాడ‌ని చెప్పు” అనే క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు.

మోహ‌న్ బాబుతో వివాదాల వేళ..

కాగా, తండ్రి మోహ‌న్ బాబుతో వివాదాలు కొన‌సాగుతున్న వేళ ఆయ‌న ఈ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న తండ్రి పాదాల‌ను తాకాల‌ని ఉందంటూ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్ భావోద్వేగానికి గురైన విస‌యం విష‌యం తెలిసిందే.

తొమ్మిదేళ్ల త‌ర్వాత..

ఇదిలాఉంటే… మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohith) కలిసి చేసిన చిత్రం ‘భైర‌వం’ ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ప్రమోషన్స్(Promotions) కూడా బాగానే చేశారు. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూర‌మైన త‌ర్వాత చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *