
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్(Betting Apps Promotions)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్న కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పలువురు టాలీవుడ్ నటీనటులు(Tollywood Actors), సినీ ప్రముఖుల(Cine Celebrities)పై మియాపూర్ పోలీసులు(Miyapur Police) కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా మరో 14 మందిపై కేసు బుక్ చేశారు.
తాజాగా కేసు నమోదైన వారిలో రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మంచు లక్ష్మీ(Manchu Lakshmi), ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరిలపై కేసు నమోదు కాదా వీరితోపాటు నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్మాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భవ్యసన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజా, రీతు చౌదరి ఉన్నారు.
In a major development, the Miyapur police in Cyberabad have registered a case against 25 people, including actors @RanaDaggubati, Prakash Raj, Manchu Lakshmi, and Nidhi Agarwal, for their alleged involvement in promoting betting apps. #Hyderabad pic.twitter.com/NOArRArc1X
— abhinay deshpande/అభినయ్ देशपांडे (@iAbhinayD) March 20, 2025
కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో ప్రజలను మభ్య పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పలువురు యూట్యూబర్లు, సినీసెలబ్రిటీలపై కసులు నమోదైన విషయం తెలిసిందే.