పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది.
ఈ నేపథ్యంలో, జూలై 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి(SS. Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) ముఖ్య అతిథులుగా హాజరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: సీనియర్ నటుడు సుమన్ రీ ఎంట్రీ.. స్టార్ మా స్క్రీన్పై కీలక పాత్రలో..
సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై విడుదలకు ముందే అంచనాలు మిన్నంటాయి. ముఖ్యంగా యుఎస్లో (USA) ప్రీమియర్ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. దాంతో, సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే రికార్డుల వేట మొదలైంది.
బిజినెస్ పరంగా కూడా ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. థియేట్రికల్ రైట్స్ సుమారు 150 కోట్ల వరకు డీల్స్ జరిగాయని సమాచారం. అదనంగా, ఓటీటీ (OTT) హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon Prime video) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.60 కోట్లు దాటినట్టు టాక్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా సందడి చేయనుంది. సత్యరాజ్, జిషు సేన్గుప్తా, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ కొంతవరకు డైరెక్ట్ చేయగా, మిగితా భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






