Wimbledon 2025: నేటి నుంచి వింబుల్డన్.. ఫేవరేట్‌‌గా బరిలోకి అల్కరాజ్

అత్యంత ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ (Wimbledon 2025) ఈ రోజు (జూన్ 30, 2025) నుంచి లండన్‌(London)లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ 138వ ఎడిషన్‌లో గ్రాస్ కోర్టు(Grass Courts)లపై రెండు వారాల పాటు ఉత్కంఠభరిత పోరాటాలు జరగనున్నాయి. ఈ ఏడాది టోర్నమెంట్ జులై 13 వరకు కొనసాగనుంది. మొత్తం £53.5 మిలియన్ల ప్రైజ్ మనీ(Prize Money)తో ఈ వింబుల్డన్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. కాగా మెన్స్ సింగిల్స్‌(Men’ Single)లో రెండుసార్లు ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) తన టైటిల్‌ను కాపాడుకునేందుకు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌గా రాణిస్తున్న అల్కరాజ్‌ను జన్నిక్ సిన్నర్, నోవాక్ జొకోవిచ్(Novak Djokovic), అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు సవాల్ చేయనున్నారు.

Wimbledon 2025 men's seeds confirmed: Jannik Sinner, Carlos Alcaraz, Novak  Djokovic, Jack Draper headline

మహిళల సింగిల్స్‌‌లో ఎవరెవరంటే..

ఇక మహిళల సింగిల్స్‌(Women’s Sinle)లో ఆర్యన సబలెంకా(Aryana Sabalenka), కోకో గాఫ్, మార్కెటా వొండ్రౌసోవా, ఎలెనా రైబకినా వంటి స్టార్ ఆటగాళ్లు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. 2023 విజేత వొండ్రౌసోవా బెర్లిన్ ఓపెన్‌(Berlin Open)లో సబలెంకాను ఓడించి ఫామ్‌లో ఉంది. బ్రిటన్ ఆటగాళ్లైన ఎమ్మా రాడుకాను, కేటీ బౌల్టర్, జాక్ డ్రాపర్‌లు స్థానిక అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా రాడుకాను తొలి రౌండ్‌లో యువ ఆటగాడు మిమి జుతో తలపడనుంది. కాగా ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ జులై 12న, మెన్స్ సింగిల్స్ ఫైనల్ జులై 13న జరగనుంది.

Wimbledon 2025: Women's singles draw analysis, preview and prediction ft.  potential Aryna Sabalenka-Madison Keys QF, Coco Gauff-Iga Swiatek QF

ఈ టోర్నమెంట్‌లో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ సిస్టమ్‌ను పూర్తిగా అమలు చేస్తున్నారు, ఇది ఆటలో కచ్చితత్వాన్ని పెంచనుంది. ఈ మ్యాచులను BBC, ESPN, స్కై స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. హులు ప్లస్ లైవ్ టీవీ, ESPN+ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *