BIG BREAKING: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి KTRపై కేసు నమోదు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి KTRను A-1గా KTR, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా HMDA చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఓఆర్ఆర్ టెండర్లపైనా కేసు

ఇదిలా ఉండగా ఓఆర్ఆర్ టెండర్లను ప్రైవేట్‌కు అప్పగించడంపైనా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా కేటీఆర్‌ కేసులపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సిట్ వేయాలని ఆయన కోరారు. టెండర్ రద్దు చేసి విచారణ ప్రారంభించాలని పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్​లో చేపట్టిన ఈ ఫార్ములా రేసింగ్(formula e hyderabad)​లో జరిగిన అవకతవకలపై కేటీఆర్​పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుమతి పత్రాన్ని గవర్నర్ సీఎస్ శాంతికుమారికి (CS Shanthi kumari) పంపించారు. ఆ లేఖను ఏసీబీ (ACB) అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ అనుమతి లేఖను సీఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు.

గవర్నర్‌ అనుమతితోనే

ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌పై (KTR) కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి కోరింది. దాదాపు నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, సాధ్యమైనన్ని అంశాలపై చర్చించే దమ్ముందా అని కేటీఆర్ అసెంబ్లీలో సవాల్ విసిరిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *