మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

Mana Enadu :  రేషన్‌ బియ్యం (Ration Rice Scam) మాయం వ్యవహారంలో వైస్సార్సీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పీఎస్‌లో పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరోవైపు రేషన్‌ బియ్యం మాయం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వారికి మచిలీపట్నంలోని స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించడంతో నిందితులను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో నిందితులుగా గోదాము మేనేజర్‌ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగరాజు ఉన్నారు.

సతీమణి జయసుధకు నోటీసులు

ఈ కేసులో దూకుడు పెంచిన అధికారులు పేర్ని నాని సతీమణి జయసుధ (Perni Jayasudha)కు నోటీసులు జారీ చేశారు.  గోదాములో బియ్యం మాయంపై ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులకు తొలుత 185 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం షార్టేజీ రాగా.. జయసుధ రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించారు. తాజాగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తం 378 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చి.. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *