Anil Ambani: అనిల్ అంబానీ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో CBI సోదాలు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), ఆయన నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు రూ. 2,000 కోట్ల బ్యాంకు మోసం(Bank Fraud) కేసులో ఈ చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆర్‌కామ్‌తో పాటు అనిల్ అంబానీపై కూడా సీబీఐ FIR నమోదు చేసింది. ముంబైలోని అనిల్ అంబానీ నివాసమైన సీవిండ్, కఫ్ పరేడ్‌లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో అనిల్ అంబానీ, ఆయన కుటుంబం ఇంట్లో ఉన్నట్లు సమాచారం. ఆర్‌కామ్‌కు సంబంధించిన ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.

రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో

SBI ఫిర్యాదు ప్రకారం, ఆర్‌కామ్ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు రూ. 2,227.64 కోట్లు, వడ్డీ(Interest)తో సహా నష్టం వాటిల్లింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం జూన్ 13, 2025న ఈ ఖాతాను “మోసం”గా వర్గీకరించారు. ఈ దాడులకు ముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రూ. 17,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని ప్రశ్నించింది.

కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లు స్వాధీనం

ఆర్‌కామ్ గతంలో దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా ఉన్నప్పటికీ, అప్పులు, పోటీ, ఆదాయం తగ్గడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆర్‌కామ్ ఇన్సాల్వెన్సీ(RCom Insolvency) ప్రక్రియలో ఉంది. ఈ దాడులతో అనిల్ అంబానీపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈడీ దాడుల్లో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా దాడులు చేయడంతో అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *