Indian Army: సీజ్‌ఫైర్‌ కొనసాగుతుంది.. భారత ఆర్మీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌తో సీజ్‌ఫైర్(Ceasefire) ఒప్పందానికి సంబంధించి తాజాగా ఇండియన్ ఆర్మీ(Indian Army) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నేటితో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ (DGMO’s)ల మధ్య ఆదివారం ఎలాంటి చ‌ర్చ‌ల‌కు ప్లాన్ చేయ‌లేద‌ని తెలిపింది. కాల్పుల విర‌మ‌ణ అవ‌గాహ‌న‌కు ముగింపు తేదీ లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యాలే ప్ర‌స్తుతానికి కొన‌సాగుతాయ‌ని ఇండియ‌న్ ఆర్మీ స్ప‌ష్టం చేసింది.

అంతర్జాతీయంగా పాక్‌ను ఎండగట్టేందుకు..

ఇక‌, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack)కి ప్ర‌తీకారంగా భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation SIndoor)తో దాయాది పాకిస్థాన్ వ‌ణికిపోయిన విష‌యం తెలిసిందే. ఎదురుదాడికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ భార‌త బ‌ల‌గాల దెబ్బ‌కు తోక‌ముడిచింది. చివ‌ర‌కు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించాల‌ని దాయాది దేశం కాళ్ల బేరానికి రావ‌డంతో భార‌త్ అంగీక‌రించింది. దాంతో కాల్పుల విర‌మ‌ణ అమ‌ల్లోకి వ‌చ్చింది. కాగా పాకిస్థాన్ వక్రబుద్ధిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ నుంచి ఏడు బృందాలు ఇవాళ తరలివెళ్లిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *