Anti-National Posts: దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్రం సీరియస్.. ఇకపై అలా చేస్తే అంతే!

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు(Anti-India Content) పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ(Ministry Of Home Affairs) అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త పాలసీ(New Policy)ని సైతం తీసుకురాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్లు, క్రియేటర్లు పెట్టే కంటెంట్ పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులు(Anti-national posts) పెడుతున్నవారిని గుర్తించేందుకు ఓ టీమ్‌ను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా పోస్టులు పెడుతున్నవారి అకౌంట్స్ బ్లాక్(Block of Accounts) చేయడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుస్తోందట.

దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్ర హోంశాఖ సీరియస్..త్వరలో కొత్త పాలసీ?

అయితే కేంద్రం చాలా కాలంగా SMపై నియంత్రణ తీసుకువస్తామని చెబుతోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో కొంతమంది యూట్యూర్లు(Youtubers), నెటిజన్లు పాకిస్థాన్‌(Pakistan)కు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టడంతో వారిపై సైతం నిఘా పెట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యతిరేక పోస్టులపై పాలసీ తీసుకువస్తే ఎల్లప్పుడు నిఘా పెట్టవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *