Youtube: 16 ఏళ్లలోపు పిల్లలు యూట్యూబ్ అకౌంట్ తెరవడంపై నిషేధం.. ఎక్కడంటే?

ఆస్ట్రేలియా(Australia) గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు యూట్యూబ్‌(Youtube) వాడకంపై బ్యాన్ విధించింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాల(Youtube Account)ను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌, ఎక్స్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ఆస్ట్రేలియా ఇలాంటి నిబంధనల(Rules)నే అమలు చేస్తోంది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే. సైబర్‌బుల్లీయింగ్, అవాంఛనీయ కంటెంట్‌ ప్రభావాలకు గురికావడం, సోషల్ మీడియా(Social Media) ఎక్కువగా వాడటం వల్ల వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల(Mental health problems) నుంచి పిల్లలను రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే

యూట్యూబ్ వీడియోల ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, సాధారణ SMలో ఉండే నష్టాలు ఇక్కడ కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను చూసిన పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే దాన్ని చూసినట్లు తేలింది. ప్రధాని ఆంథోనీ అల్బనీస్(PM Anthony Albanese) మాట్లాడుతూ, డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని చెప్పారు. సైబర్‌బుల్లీయింగ్, అసభ్యకరమైన కంటెంట్, ఆన్‌లైన్ గ్రూమింగ్, ఎక్కువ స్క్రీన్ సమయం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

How the world reacted to Australia's social media ban: 'Get the popcorn  ready' | SBS News

10 మందిలో తొమ్మిది మంది ప్రభుత్వానికి మద్దతు

మైనర్‌లు యూట్యూబ్‌లో అకౌంట్ లేకుండా వీడియోలు చూడొచ్చు, కానీ వారికి పర్సనల్ సిఫార్సులు, వీడియోలు పెట్టడం, కామెంట్ చేయడం వంటి సదుపాయాలు ఉండవు. ఆస్ట్రేలియా ప్రజల్లో పది మందిలో తొమ్మిది మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. ప్రపంచంలోనే ఇది చాలా కఠినమైన సోషల్ మీడియా నియంత్రణలలో ఒకటి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఇలాంటి భద్రతా చర్యలను అమలు చేసే అవకాశాలూ లేకపోలేదు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *