China Floods: చైనాను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు.. 34 మంది మృతి

చైనా(China)లో భారీ వర్షాలు(Heavy Rains), వరదలు(Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌(Beijing)లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా బీజింగ్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వరదల కారణంగా మియున్ జిల్లా(Miun District) తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ గల్లంతైంది.

China battles 'once a century' floods as Typhoon Higos bears down - Nikkei Asia

ఇదిలా ఉండగా చైనాలోని లువాన్ పింగ్ కౌంటీ(Luan Ping County)లోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటం(Landslide)తో కొంతమంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. జనావాసాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదుల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

In photos: Heavy rains batter Chinese province of Guangdong causing massive floods - The Washington Post

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిమయంగా మారింది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చైనా ప్రధాన మంత్రి లి క్వియాంగ్(China PM Li Keqiang) తెలిపారు. కాగా చైనాలో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *