Chiranjeevi: ట్యాలెంటెడ్ యంగ్​ డైరెక్టర్​తో చిరు సినిమా

Mana Enadu : టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబో కుదిరింది. అగ్ర కథానాయకుడు చిరంజీవితో (Chiranjeevi) ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth odela) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘దసరా’తో సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్​ ఓదెల.. చిరంజీవికి కథ చెప్పి మెప్పించాడు. అయితే దసరా విడుదల తర్వాతే శ్రీకాంత్‌ తన అభిమాన కథానాయకుడైన చిరుకి కథ వినిపించారు. రెండో సినిమాగానే ఆయనతో చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు సెట్​ అయ్యింది.

తన మొదటి సినిమాను నానితో తీసిన శ్రీకాంత్‌ ఓదెల.. రెండో చిత్రాన్ని కూడా నానీతో ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల కలిసి సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ప్రస్తుతం మరో యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (vishwambhara) సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా 6 ఫిలింఫేర్​ అవార్డులు సొంతం చేసుకుంది. శ్రీకాంత్​ డెబ్యూ డైరెక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు (filmfare awards) దక్కించుకున్నారు. ధరణి క్యారెక్టర్‌లో అదరగొట్టిన నాని ఉత్తమ నటుడు, వెన్నెల పాత్రలో  అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేశ్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని ‘ధూమ్ ధామ్’ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్​ కొల్లా అవార్డులు అందుకున్నారు. మరి చిరంజీవితో శ్రీకాంత్​ ఓదెల తీయబోయే సినిమా ఎలాంటి రికార్డ్స్​ క్రియేట్​ చేస్తుందో వేచి చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *