పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం పొందిన వీరికి సోషల్‌ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 బాల బాబాయ్​కి కంగ్రాట్స్

‘ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు పొందిన బాల బాబాయ్​కి అభినందనలు. మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి, అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనమే ఈ గుర్తింపు’ అని ఎన్టీఆర్ ట్వీట్ షేర్ చేశారు. మరోవైపు నటుడు కల్యాణ్ రామ్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పారు. ‘పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్’ అని ట్వీటారు.

సంతోషంగా ఉంది

‘‘ఐదు దశాబ్దాలకుపైగా తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ (Balakrishna) పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం శాసన సభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాలయ్యకు అభినందనలు తెలియజేశారు.

మెగాస్టార్, సూపర్ స్టార్ విషెస్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఈ అవార్డును అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు’’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *