రైతులకు గుడ్ న్యూస్.. ఆ 3 లక్షల మందికి నేడే రుణమాఫీ

తెలంగాణ రైతులకు శుభవార్త. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ (Rythu Runa Mafi) నగదును నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేయనున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్ వేదికగా రైతులపై ఆయన వరాల జల్లు కురిపించనున్నారు. దాదాపు 3 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లను నాలుగో విడతగా రుణమాఫీ నగదు విడుదల చేయనున్నట్లు సమాచారం.

రైతు పండుగ ముగింపు వేడుకకు సీఎం రేవంత్ 

మహబూబ్​నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ (Rythu Panduga) ముగింపు వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (శనివారం) హాజరు కానున్నారు. అనంతరం అమిస్తాపూర్​లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రైతు పండుగ వేడుకలను సర్కారు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అమిస్తాపూర్ లో రైతులపై సీఎం వరాలు

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​లో సీఎం రేవంత్ (CM Revanth Mahabubanagar Visit) అమిస్తాపూర్ చేరుకుని రైతు పండుగ ప్రదర్శనను తిలకించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్​కు తిరుగు పయనమవుతారు. ఈ సభా వేదికగా రుణమాఫీ, రైతు భరోసా (Rythu Bharosa)కు సంబంధించి రైతులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

సీఎం రాకతో భారీ బందోబస్తు

ఇక సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా సహా సమీపంలోని రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ సహా ఇతర జిల్లాల నుంచి రైతులను కాంగ్రెస్ కార్యకర్తలు తరలిస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. అదే విధంగా మహబూబ్​నగర్, భూత్పూర్ మార్గంలో ప్రయాణించే వాహనాలను బైపాస్, జడ్చర్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *