రేపే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణం.. ఈ సాయంత్రం CM అభ్యర్థి ఎంపిక

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి(New Chief Minister of Delhi) రేపు ప్రమాణస్వీకారం(Oath) చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని కమలం పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(Lieutenant Governor of Delhi) ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాంలీలా మైదానం(Ramlila Maidan)లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది. కొత్త సీఎం ఎంపిక కోసం ఈ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని BJP కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.

రేసులో ఉంది వీరే..

ఢిల్లీ సీఎం రేసులో ప్రధానంగా పర్వేశ్ వర్మ(Parvesh Varma), రేఖా గుప్తా(Rekha Gupta) పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆశిష్ సూద్, శిఖా రాయ్, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవుల కోసం ఇప్పటికే దాదాపు 15 మంది పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి 20 రాష్ట్రాల CMలకు ఆహ్వానాలు అందాయి. 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రితో పాటు పలువురు మత ప్రముఖులు హాజరుకానున్నారు.

Delhi CM race: Will capital get woman CM for fourth time? Is BJP planning a  'surprise' pick? Check top contenders | Mint

కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *