విమాన ప్రమాదంలో కుట్రకోణం? 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడంపై అనుమానం

ఎయిరిండియా(Air India)కు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌(Ahmadabad)లో కుప్పకూలి 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌(Medical College Hostel)పై కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఈ ఉదంతంలో కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ(Ministry of Civil Aviation) సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌(Muralidhar Mohol) వెల్లడించారు.

అన్ని కోణాల్లోనూ విచారణ

ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. పుణె(Pune)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విమానం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్‌బాక్స్‌(Black Box)ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను మంత్రి మురళీధర్ పూర్తిగా ఖండించారు.

పలు ఏజెన్సీలు సమన్వయంతో..

“బ్లాక్‌బాక్స్‌ మన దేశంలోనే, దర్యాప్తు సంస్థల వద్దే సురక్షితంగా ఉంది. దానిని ఎక్కడికీ పంపే ప్రసక్తే లేదు” అని ఆయన తేల్చిచెప్పారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు(Enquiry) ప్రారంభించిందని తెలిపారు. CCTV ఫుటేజీని విశ్లేషించడంతో పాటు పలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. 2 ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం అనేది అత్యంత అరుదైన విషయమని మంత్రి పేర్కొన్నారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *