Corona active cases : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇండియా మొత్తం ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసులు 2,710 ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారం రోజులుగా కేరళ (kerala), మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. అత్యంత వేగంగా కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళలో కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రకటించారు. ఆ తర్వాత ఢిల్లీలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.

దేశంలో కరోనా కేసులు 2,710

మే 26న దేశంలో మొత్తం 1,010 కేసులు నమోదు కాగా.. మే 30 నాటికి ఆ సంఖ్య 2,710కి పెరిగినట్లు ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో (covid) కొత్త వేరియంట్లతో భయం అక్కర్లేదని పేర్కొంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం చైనా, థాయ్ లాండ్, సింగపూర్ దేశాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ల ప్రభావం తక్కువగానే ఉన్నట్లు జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్ల నొప్పులు ఉంటాయని చెబుతున్నారు.

మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ సూచనలు

తెలంగాణలో (telangana) ఇప్పటి వరకు మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 16 కేసులు నమోదు కాగా.. మిజోరం, అస్సాంలో ఇద్దరు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం 2,710 కేసులు నమోదు కాగా.. అత్యధికంగా కేరళలో 1,147 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 424. ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, తమిళనాడు, కర్ణాటకలో 148 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జాగ్రత్తలతోనే కరోనా సోకకుండా ఉండొచ్చని బయటకు వెళ్లినపుడు ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *