Corona Virus: మళ్లీ మాస్కులు తప్పనిసరా? రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా(Corona Virus) మహమ్మారి చాపకింద నీరు లాగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల(Positive Cases) సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల(Active Covid Cases) సంఖ్య 4500 దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఏడుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Central Health Department) వర్గాలు వెల్లడించాయి. కేరళ(Keral)లో అత్యధికంగా కరోనా కేసులు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీల్లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ…

ఇక బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. అలాగే మరో 674 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం APలో 50, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక అత్యధికంగా కేరళలో 1413 కేసులుండగా.. ఢిల్లీ 681, మహారాష్ట్ర 521, కర్ణాటక 293, తమిళనాడు 291, గుజరాత్ 271, వెస్ట్ బెంగాల్‌లో 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రజలు మాస్కులు(Masks) ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *