Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy, 83) శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25న జన్మించిన సుధాకర్‌రెడ్డి, విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం(Left-wing ideology)తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కర్నూలు ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందారు.

కార్మిక, రైతు, విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర

సుధాకర్‌రెడ్డి 1966లో AISF జనరల్ సెక్రటరీగా, 1970లో అధ్యక్షుడిగా పనిచేశారు. 1971లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌(CPI National Council)లో చేరి, 1998, 2004లో నల్గొండ నుంచి లోక్‌సభ(Loksabha)కు ఎన్నికయ్యారు. 2012-2019 మధ్య సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేశారు. కార్మిక, రైతు, విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, 2000లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన, సామాజిక న్యాయం, కార్మిక హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.

రాజకీయ ప్రముఖుల సంతాపం

సుధాకర్‌రెడ్డి మరణంతో వామపక్ష రాజకీయాల్లో పెను లోటు ఏర్పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, BRS అధ్యక్షుడు కేసీఆర్, KTR, హరీష్ రావు, సీపీఐ నేత కే. నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్‌లకు పలువురు రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు అధికారక లాంఛనాలతో జరగనున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *