RamCharan-Rashmika: క్రేజీ కాంబినేషన్.. చెర్రీతో జతకట్టనున్న రష్మిక!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు మార్మోగిపోతోంది. ఏ సినిమా చేసిన బంపర్ హిట్ అవుతోంది. వరుస మూవీలతో జోరుమీదున్న రష్మిక.. మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. యానిమల్, పుష్ప-2తో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా హిందీలో ‘ఛావా(Chhaava)’ మూవీలోనూ నటించగా.. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో రష్మిక నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)తో జతకట్టేందుకు రష్మిక సిద్ధమైనట్లు టీటౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్

వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) దర్శకత్వంలో రామ్‌చరణ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలోనూ చెర్రీ ఓ మూవీకి సైన్ చేశాడు. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్సే పెట్టకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన లెక్కల మాస్టార్, గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌(Action entertainer)గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని చూస్తున్నట్లు మేకర్స్ భావిస్తున్నారట.

Read all Latest Updates on and about Rashmika Mandanna

 సినీ వర్గాల్లో జోరుగా చర్చ

ఇప్పటివరకు రామ్‌చరణ్‌, రష్మిక కాంబో(Ram Charan-Rashmika combo)లో ఒక్కమూవీ కూడా రాలేదు. కాబట్టి, ఈ కొత్త జోడీ తెరపై ఆకట్టుకుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం ఉండటంతో హీరోయిన్ ఎంపికలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, రష్మిక మందన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *