దాడి ఎఫెక్ట్.. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు

Mana Enadu : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో (Sandhya Theatre Stampede Case) ఓ మహిళ మరణించడంతో వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Case) ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇంటి గోడ దూకి టమాటలు విసరడం, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బన్నీ ఈరోజు చిక్కడపల్లిలోని పోలీస్​ స్టేషన్​లో విచారణకు హాజరైన సందర్భంగా ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

పరదాలతో అల్లు అర్జున్ ఇల్లు క్లోజ్

ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ ముగియడంతో ఆయన తన ఇంటికి చేరుకున్నారు. అయితే ఆయన ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు (Curtains At Allu Arjun Residence) ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు దాడి చేసిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ పరదాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మీడియా కూడా ఆయన ఇంటి వైపునకు చూడకుండా గేటు నుంచి బాల్కనీ వరకు ఈ పరదాలు కట్టారు.

ఆ సీన్ రిపీట్ కాకుండా 

ఇటీవల ఓయూ జేఏసీ నాయకులు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ (Allu Arjun House Attacked) ఇంటి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తు నినాదాలు చేశారు.  కొందరు ఆందోళన కారులు  అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లు విసిరి.. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టు వారిని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *