‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇందులో భాగంగానే ఇటీవల అమెరికా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.

డాకు ఈవెంట్ రద్దు

కానీ నేడు అనంతపురం వేదికగా జరగాల్సిన ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Daaku Maharaaj Event Cancel) మేకర్స్ రద్దు చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ (Nara Lokesh) చీఫ్ గెస్టుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది. బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్‌’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఎంతో బాధగా ఉంది

‘‘తిరుపతిలో జరిగిన (Tirupati Stampede) ఘటనకు మా చిత్ర బృందమంతా ఎంతో బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది.

తిరుపతిలో తొక్కిసలాట

ఇక తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మందికి గాయాలయ్యాయని TTD ఈవో శ్యామల రావు తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *