వేములవాడ రాజన్న ఆలయ కోడెల మృత్యుఘోష!

వేములవాడ రాజన్న గోశాలలో (Goshala) కోడెలు వరుసగా చనిపోతూనే ఉన్నాయి. శుక్రవారం అనారోగ్యంతో 8 కోడెలు చనిపోగా.. శనివారం 5 కోడెలు మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపులేమి తనంతో కోడెలు చనిపోతున్నాయి. సరైన ఆవాసం, మేత ఉండటం లేదు. దీంతో రెండు రోజుల్లోనే 13 కోడెలు చనిపోయాయి. గోశాలలో కోడెలు ఉండాల్సిన వాటి కంటే కంటే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రైతులకు కోడెల పంపిణీని నిలిపివేశారు. దీంతో సామర్థ్యం కంటే ఎక్కువయ్యాయి. అక్కడ షెడ్లలో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోడెల చనిపోవడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పశువైద్య శిబిరం పెట్టి కోడెలకు వైద్యం అందిస్తున్నారు. దీంతో అక్కడి కోడెలకు ఆహారం లేక నీరసించి కోడెలు చనిపోయినట్లు తెలుస్తోంది.

కోరికలు తీరితే కోడెల మొక్కు తీర్చుడే..

వేములవాడ రాజన్న (vemulawada rajanna temple) కోరిన కోర్కెలు తీర్చితే నిజ కోడెను సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు. దీంతో వారు కోడెను సమర్పిస్తారు. రాజన్న ఆలయానికి కోడెలు ఇస్తుండగా.. వాటిని అధికారులు తిప్పాపూర్‌ లోని గోశాలకు తీసుకెళ్లి సంరక్షిస్తుంటారు. అయితే ఆరు నెలల క్రితం కోడెల పంపిణీ లో అవకతవకలు జరిగాయి. ఒకే వ్యక్తికి 60 జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గోశాలలో కోడెల సంఖ్య పెరిగిపోయింది. అక్కడ కనీస వసతులు కరువయ్యాయి.

పరిమితికి మించి కోడెలు

తిప్పాపూర్ ( tippapur goshala) లో ఉన్న గోశాలలో 400 నుంచి 500 కోడెలు ఉండేందుకు స్థలం ఉంది. కానీ ప్రస్తుతం అందులో 1250కి పైగా కోడెలను ఉంచుతున్నారు. ఇరుకు స్థలంలో కోడెలను ఉంచడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటికి సరైన తాగునీటి వసతి, నీడ, మేత ఉండటం లేదు. దీంతో పాటు అపరిశుభ్ర వాతావరణం లో ఉంటున్నాయి. ఎక్కువ గోవులు, తక్కువ ప్లేస్ తో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రోజూ 400 కోడెలకు మాత్రమే పచ్చగడ్డి అందిస్తున్నట్లు అధికారులు చెబుతుండగా భక్తులు మండిపడుతున్నారు. అర్ధాకలితో కోడెలు చనిపోవడాన్ని చూసీ తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆలయ అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *